శని, ఆదివారాల్లో చేప ప్రసాదం పంపిణీ.. 1.6 లక్షల చేప పిల్లలు సిద్ధం

  • మొత్తం 5 లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు
  • శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం
  • 32 కౌంటర్ల ఏర్పాటు
చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమవుతోంది. ఆస్తమా రోగుల కోసం ప్రతీ ఏడాది పంపిణీ చేసినట్టుగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

మొత్తం 32 కౌంటర్ల ద్వారా 5 లక్షల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ కొసాగుతుందని చెప్పారు. ప్రసాదం పంపిణీ కోసం 1.6 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Go Back to Shorts
fish medicine
Nampally
Hyderabad
Telangana

More Telugu News